Telangana | సంగారెడ్డి జిల్లా అన్నారంలో ఘరానా మోసం బయటపడింది. జిన్సెంగ్ ఆయిల్ పేరిట రూ.1.76 కోట్ల భారీ మోసం బట్టబయలు అయింది. యూకేకి చెందిన ఓ మహిళ ఆయిల్ సరఫరా చేస్తే రెట్టింపు లాభాలు వస్తాయని నరహరి అనే వ్యక్తికి గాలం వేసింది. దీంతో ఆ మహిళ మోసపూరిత మాటలు నమ్మిన నరహరి.. ఆయిల్ కోసం రూ.1.76 కోట్లు చెల్లించాడు. తీరా డబ్బులు తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యాక ఎలాంటి స్పందన లేకుండా జారుకుంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.