ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనానికి 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. బుధవారం శ్రీవారిని 63,382 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,478 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.