తెలంగాణలో వడదెబ్బతో 107 మంది మృతి

దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. తెలంగాణలో వడదెబ్బతో నిన్న ఒక్కరోజే 51 మంది మృతి చెందారు. గత మూడు రోజుల్లో వడదెబ్బతో 107 మంది మృతి చెందారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న 23 మంది మరణించారు. 32 జిల్లాల్లో 40 నుండి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. భద్రాద్రి, జగిత్యాల, సూర్యాపేట, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, కొమురం భీం జిల్లాల్లో 46 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 27వ తేదీ వరకు వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Latest Articles

కుల వ్యవస్థను నిర్మూలించేందుకే ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు నిర్మిస్తున్నాం- రేవంత్ రెడ్డి

విద్యారంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయన్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్