Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

పలమనేరు నియోజకవర్గంలో వైసీపీకి ఓటమి తప్పదా?

      ఒక్కోసారి అదృష్టం పట్టుకుంటే పదవి దానంతట అదే వచ్చి ఒళ్లో వాలుతుందంటారు. ఈ నేపథ్యంలోనే రాజకీ యంగా ఎలాంటి అనుభవం లేని ఓ నాయకుడు కాకలు తీరిన ప్రత్యర్థిని ఓడించాడు. గెలిచాక ఎన్నికల ప్రచారంలో చేసిన హామీలన్నీ గాలికి వదిలేశాడు.దీంతో ఆ ఎమ్మెల్యే ప్రజలకు దూరం అయ్యాడు. తన గెలుపుకు సపోర్ట్ చేసిన సీనియర్లను నిర్లక్ష్యం చేయడంతో సీనియర్ నేతలు దూరం అయ్యారు. ప్రస్తుతం ఆ వైసీపీ ఎమ్మెల్యేకి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దక్కుతుందా? ఒక వేళ వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయి. ఇంతకీ ఆ నియోజక వర్గం ఏది? ఆ నేత ఎవరు? అనుకుంటున్నారా ?

    చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి భంగపాటు తప్పే లా లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డిని ఏమాత్రం రాజకీయ అనుభవం లేని యువనాయకుడు వెంకటే గౌడ దాదాపు 33 వేల ఓట్ల మెజారి టీతో ఓడించారు. కర్ణుడి చావుకు సవా లక్షా కారణాలన్నట్లు రాజకీయ ఉద్దండుడు అయిన మాజీమంత్రి అమర్‌ నాథ్ రెడ్డి ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే గా గెలిచి అనంత రం టీడీపీలో చేరి మంత్రి పదవి తీసుకున్నారు. దీంతో పార్టీ మారారన్న కారణంతో ఆయన మంత్రి అయి నియోజకవ ర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు విశ్వాసాన్ని తిరిగి పొందడంలో విఫలమయ్యారు. దానికి తోడు తాను నమ్మిన వారందరూ అధికారం ఉన్నంత వరకు పదవులు అనుభవించి, ఎన్నికల ముందు ప్లేట్ ఫిరయించారు. దానికి తోడు 2009 ఎన్నికల్లో తన ప్రత్యర్థి గత ఎన్నికల వరకూ టీడీపీలో కొనసాగిన ఆర్వీ సుభాష్ చంద్రబోస్ అసంతృప్తి వర్గం సైతం ఆయన ఓటమికి కారణమని చెప్పొచ్చు. దీంతో సొంత పార్టీ అయిన టీడీపీలోనూ ఆయనకు సహాయ నిరాకరణ ఎదురైంది. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఫ్యాన్ గాలి ప్రభావంతో సిట్టింగ్ మంత్రిపై ఎమ్మెల్యే గా గెలుపొందిన వెంకటే గౌడకు అనుభవ లేమి పెద్ద ఆటంకంగా మారింది. పార్టీలో ఎప్పటి నుండో ఉంటూ పార్టీ కోసం, వెంకటే గౌడ గెలుపు కోసం కష్టపడ్డ వారిని పట్టించుకోకపోవడంతో అతి తక్కువ కాలంలోనే సీనియర్లు పార్టీకి కూడా దూరమయ్యారు.

      నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ రెండు మూడు గ్రూపులు ఏర్పడటంతో వెంకటే గౌడకు తలనొప్పిగా మారింది. కొంతమంది సీనియర్లు నేరుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్దకే వెళ్లి తమకు కావాల్సిన పనులు చక్కబెట్టుకుంటున్నారు. దీంతో శాసనసభ్యుడుగా ఉన్నా కూడా నియోజకవర్గంలో వెంకటే గౌడకు విలువ లేకుండా పోయింది. దీనికి తోడు 2019 ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించారు. 2019లో పలమనేరులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాక్షిగా ఇచ్చిన హామీలైన గంగన్న శిరస్సు ప్రాజెక్టు, దుముకురాళ్లు ఎత్తిపోతల పథకం, పలమనేరు పెద్ద చెరువు డ్రైనేజీ సమస్య పరిష్కారం, హంద్రీనీవా పూర్తి చేసి సాగునీరు ఇవ్వడం, ఇంటింటికి ఉచిత కుళాయి… వీకోట షాదిమహల్, డిగ్రీ కాలేజ్, అంబేద్కర్ భవన్, బీసీ భవన్ వంటి హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోవడం వెంకటే గౌడకు పెద్ద దెబ్బ అని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. నియోజక వర్గ ప్రజలను, సీనియర్లను డీల్ చేసే విధానం కుదరక ఎమ్మెల్యే వెంకటే గౌడ కు స్థానికంగా అందరూ దూరం అయ్యారు. ఇవి చాలవన్నట్లు సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటే గౌడపై దౌర్జన్యంగా క్వారీ లాక్కున్నాడంటూ కర్ణాటక రాష్ట్రం కోలార్ కు చెందిన క్వారీ యజమాని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన అరాచకాలను వివరించడం గమనార్హం. అంతేగాక ఆయనకు ఇచ్చిన చెక్ బౌన్స్ అవడంతో కోలార్ కోర్టుకు హాజరైన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తాజాగా కుప్పంలో చంద్రబాబు సభలో కూడా వారి ఓనర్ జనార్దన్ నాయుడు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ దాదాపు 200 కోట్లు సంపాదించారని ఆరోపించారు.

     అంతేగాక కరోన ఫస్ట్ వేవ్‌లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే వాటిని ప్రసారం చేసిన మీడియా వారిని లైవ్ పెట్టి మరీ బూతులు తిట్టారు. ఇన్ని ప్రతికూల అంశాలు ఉండటంతోపాటు జిల్లా స్థాయిలో ముఖ్య పదవిలో ఉన్న ఓ ముఖ్య నేతకు, ఎమ్మెల్యేకు మధ్య కొద్ది రోజులుగా పోటా పోటీగా ప్రోటోకాల్ రగడ జరుగుతోంది. భవిష్యత్ లో ఆ నేతతోపాటు పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహిత వర్గంతో సహా చాలామంది ఈ దఫా ఎమ్మెల్యే సీటు తమకే కావాలనుకుం టున్నారు. ఆశావహుల్లో ఎవరి ఛానళ్ళ లో వారు తమ ప్రయత్నలను చాపకింద నీరులా చేస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ దఫా వెంకటే గౌడకు టికెట్ దక్కడం అనుమానమే అని రాజకీయ వర్గాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున గుసగుస లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి పెట్టిన లిస్టులో వెంటేగౌడ పేరు లేకపోవడం నియోజక వర్గంలో గుసగుసలాడుకుంటున్నారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి ఫిరాయింపు చేసిన సుభాష్ చంద్రబోస్ కి టికెట్ కట్టపెడతారని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు.

     మరోవైపు నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు చేస్తున్న ఇసుక అక్రమ రవాణా, గ్రావెల్ మాఫియా, దౌర్జన్యా లు, రోడ్ల దుస్థితి వైసీపీకి ప్రతికూల అంశాలుగా మారాయి. మాజీమంత్రి అమరనాథ రెడ్డి గత ఎన్నికల్లో చేసిన తప్పుల ను సరిదిద్దుకుంటూ అందర్నీ కలుపుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా వ్యతిరేక కార్యక్ర మాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంతో పాటు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో నియోజకవర్గమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు అమర్నాథ్ రెడ్డి. అటు పలమనేరు లో ఎమ్మెల్యే ఇటు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం అయితే సాగుతోంది. అయితే కొన్నిచోట్ల అమర్ నాథరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వెంకటే గౌడ ని విమర్శించడం దాన్ని కౌంటర్ గా ఎమ్మెల్యే వెంకటే గౌడ కౌంటర్ ఇవ్వడం ఇది నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు నేతలు అభివృద్ధి వదిలేసి మీకు మీరే ప్రెస్ మీట్ లు పెట్టుకొని సవాళ్లు విసుకోవడం ఏంటి అంటూ అటు టీడీపీ ఇటు వైసీపీ వర్గాలు చెప్పలేకపోతున్నారు. తాజా గా వాటర్ బిల్లులు కట్టని చాలామంది సర్పంచులను అరెస్ట్ చేశారు.దీంతో ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించాలని పలు పంచాయితీల సర్పంచులు కంకణం కట్టుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డికి ప్రజల్లో భారీగా ఆదరణ రావడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారు. మొత్తానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు నియోజక వర్గంలో వైసీపీకి భంగపాటు తప్పదని… అమర్నాథ్ రెడ్డి గెలుపు ఖాయమని రాజకీయ శ్లేషకులు భావిస్తున్నారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్