ఎబోలా వైరస్ కేసులున్న ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చిన వారికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో థర్మల్ స్క్రీనింగ్ కొనసాగుతోంది. ఏబోలా అనుమానితులను గాంధీ హాస్పిటల్ ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 ఏబోలా వైరస్ లక్షణాలున్న కేసులు నమోదయ్యాయాని గాంధీ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీ కృష్ణ తెలిపారు. కరోనా లాగా ఏబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందదని, కానీ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని డాక్టర్ వంశీ కృష్ణ తెలిపారు. ఎబోలా లక్షణాలుంటే 21 రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచాలని చెప్పారు.
హైదరాబాద్లో ఇద్దరు అనుమానితులకు ఎబోలా లక్షణాలు.. గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్కు తరలింపు
0
69
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


