ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్ర చేస్తోం దని ఆరోపించారు. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని చెప్పారు. రూ. 25 కోట్లు ఇస్తాం బీజేపీ టికెట్ పై పోటీ చేయాలని తమ ఎమ్మెల్యేలను కోరినట్లు చెప్పారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ ఆఫర్ను తిరస్కరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. కొద్ది రోజుల్లో తనను అరెస్ట్ చేస్తామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని… ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేక మద్యం కేసుతో.. ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ చూస్తోందని కేజ్రివాల్ ఆరోపించారు.