ఏలేరు వరద ఉధృతితో ముంపునకు గురైన గ్రామాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటన

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత YS జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏలేరు వరదలతో అతలాకుతలమైన గ్రామాల్లో ఆయన పర్యటించబోతున్నారు. ఆయన ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పదిన్నరకు పిఠాపురం చేరుకుంటారు. అక్కడినుంచి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం యు.కొత్తపల్లి మండలం నాగులపల్లికి వెళ్తారు జగన్‌. అక్కడినుంచి బయలుదేరి రమణక్కపేట వెళ్తారు. వరద బాధితులతో మాట్లాడిన తర్వాత తిరిగి పిఠాపురం చేరుకుంటారు. మధ్యాహ్నం పిఠాపురం నుంచి తాడేపల్లి తిరుగుపయనమవుతారు జగన్‌.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్