శ్రీ శోభా క్రియేషన్స్ పతాకంపై హర్షవర్ధన్ ,నిహారిక హీరో హీరోయిన్లుగా బీవీ అంజనీ ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “బేవార్స్ గాడు”. ఈ చిత్రం రెండు షెడ్యూల్ కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ పరిసరప్రాంతాలలో పూర్తి చేసుకొని ప్రస్తుతం హైదరాబాద్ పరిసరప్రాంతాలో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకొంటోంది.
ఈ సందర్భంగా దర్శకుడు బీవీ అంజనీ ప్రసాద్ మాట్లాడుతూ… ‘‘ఈ షెడ్యూల్తో పాటల చిత్రీకరణ మినహా టాకీపార్ట్ పాటు పూర్తవుతుంది. ఇందులో కీలక పాత్రలో సుమన్ నటిస్తున్నారు. గత జన్మలో కన్నతల్లి చావుకు కారకుడైన కొడుకు.. మళ్లీ జన్మించి కన్నతల్లి రుణాన్ని ఎలా తీర్చుకున్నాడు అన్నదే ముఖ్య కథాంశం. సోషియో ఫాంటసీగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఉంటుంది. ఈ చిత్రంలో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉన్నాయి.’’ అని తెలిపారు.