మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతల పర్యటన కొనసాగుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రామంతాపూర్లోని బాలకృష్ణానగర్లో మూసీ పరివాహక ప్రాంతాన్ని బీజేపీ ప్రతినిధి బృందం పరిశీలించింది. ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలో NVSS ప్రభాకర్, శిల్పారెడ్డి, స్థానిక కార్పొరేటర్ అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లను కూల్చివేస్తారనే ప్రచారం జరుగుతోందని.. తమను ఆదుకోవాలని ఈటల రాజేందర్ను స్థానికులు కోరారు. దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్నామని.. ఇక్కడి నుంచి పొమ్మంటే ఎక్కడికి వెళ్లాలని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతల పర్యటన
0
289
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


