పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదంతో రెండు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకు న్నాయి. మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మధు అనే వ్యక్తి కుటుంబం పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు.ఈనెల 8న పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు మధు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయలుదేరారు. వారితోపాటు పెంపుడు కుక్క కూడా బయటకు వచ్చి, నిర్మాణంలో ఉన్న ఎదురింటి ధనుంజయ్ ఇంటి ఆవరణలోకి వెళ్లింది. కుక్కను తమపై ఉసిగొల్పారంటూ ధనుంజయ్ కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఈ గొడవపై రెండు కుటుంబాలు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరుసటి రోజు మధు సోదరుడు శ్రీనాథ్ కుక్కను బయటకు తీసుకెళ్తుండగా నలుగురితో కలిసి ధనుంజయ్ దాడి చేశాడు. కుక్కను ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టడంతో అడ్డు వచ్చిన మధు కుటుంబంపై కూడా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన ఐదుగురిని అరెస్టు చేశారు.
పెంపుడు కుక్క విషయంలో రెండు కుటుంబాల పరస్పర దాడులు
0
397
Previous article
Next article
Latest Articles
ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య గురువారం రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో ఒక పెద్ద నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. తన రాజీనామాను సమర్పించిన కొద్దిసేపటికే, సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ, “నేను లోక్భవన్లో నా...
- Advertisement -
- Advertisement -


