36.6 C
Hyderabad
Friday, April 18, 2025
spot_img

పెంపుడు కుక్క విషయంలో రెండు కుటుంబాల పరస్పర దాడులు

పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదంతో రెండు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకు న్నాయి. మధురా నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రహ్మత్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మధు అనే వ్యక్తి కుటుంబం పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు.ఈనెల 8న పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు మధు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయలుదేరారు. వారితోపాటు పెంపుడు కుక్క కూడా బయటకు వచ్చి, నిర్మాణంలో ఉన్న ఎదురింటి ధనుంజయ్ ఇంటి ఆవరణలోకి వెళ్లింది. కుక్కను తమపై ఉసిగొల్పారంటూ ధనుంజయ్ కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఈ గొడవపై రెండు కుటుంబాలు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరుసటి రోజు మధు సోదరుడు శ్రీనాథ్‌ కుక్కను బయటకు తీసుకెళ్తుండగా నలుగురితో కలిసి ధనుంజయ్‌ దాడి చేశాడు. కుక్కను ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టడంతో అడ్డు వచ్చిన మధు కుటుంబంపై కూడా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన ఐదుగురిని అరెస్టు చేశారు.

Latest Articles

‘డియర్ ఉమ’ చిత్రాన్ని సక్సెస్ చేయండి: సుమయ రెడ్డి

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్