21.7 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

ముగ్గురు విద్యార్థినిల మిస్సింగ్ కలకలం

నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు మిస్సింగ్ కలకలం రేపుతుంది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు పదో తరగతి విద్యార్థినిలు కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళికలు అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన సమచారం మేరకు మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కు చెందిన కొండపల్లి శిరీష లింగమయ్య గుట్టకు చెందిన గడ్డం రవళిక, హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన వరలక్ష్మిలు ఇంటి నుండి స్కూల్ కు వెళ్తామని బయలుదేరారు. కానీ పాఠశాలకు వెళ్లకపోవడంతో ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. వరలక్ష్మి తండ్రి తన కూతురు ఇంటి నుండి పాఠశాలకు వెళ్లిందని చెప్పారు. మిగతా ఇద్దరు విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఫోన్లు కలవలేదు. కాగా తమ పిల్లలు పాఠశాలకు వెళ్లలేదని కుటుంబ సభ్యులకు తెలియడంతో సమాచారం కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఎస్సె వినయ్ కుమార్ పూర్తి వివరాలు తెలుసుకొని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Latest Articles

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ అభివృద్ధికి సహకరించండి- శ్రీధర్‌బాబు

'కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్‌గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్