ముగ్గురు విద్యార్థినిల మిస్సింగ్ కలకలం

నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు మిస్సింగ్ కలకలం రేపుతుంది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు పదో తరగతి విద్యార్థినిలు కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళికలు అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన సమచారం మేరకు మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కు చెందిన కొండపల్లి శిరీష లింగమయ్య గుట్టకు చెందిన గడ్డం రవళిక, హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన వరలక్ష్మిలు ఇంటి నుండి స్కూల్ కు వెళ్తామని బయలుదేరారు. కానీ పాఠశాలకు వెళ్లకపోవడంతో ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. వరలక్ష్మి తండ్రి తన కూతురు ఇంటి నుండి పాఠశాలకు వెళ్లిందని చెప్పారు. మిగతా ఇద్దరు విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఫోన్లు కలవలేదు. కాగా తమ పిల్లలు పాఠశాలకు వెళ్లలేదని కుటుంబ సభ్యులకు తెలియడంతో సమాచారం కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఎస్సె వినయ్ కుమార్ పూర్తి వివరాలు తెలుసుకొని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Latest Articles

నిలోఫర్ బిల్డింగ్ ఫైర్ NOC సస్పెండ్

బంజారాహిల్స్‌లోని నిలోఫర్ బిల్డింగ్‌ను ఫైర్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పైభాగంలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు తేల్చారు. తక్షణమే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్