20.7 C
Hyderabad
Saturday, December 2, 2023
spot_img

దేశంలో మొట్టమొదటి సారిగా ఇంటి నుంచి ఓటు వేసే విధానం

దేశంలో మొట్టమొదటి సారిగా ఇంటి నుంచి ఓటు వేసే విధానం కర్ణాటకలో పూర్తిస్థాయిలో అమలు కానుంది. ఈ మేరకు కర్ణాటక ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు (వీఎఫ్​హెచ్) విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రానికి రాలేని దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు.. ఇంటి నుంచే ఓటు వేసేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్‌కు 5 రోజులు ముందుగా వెలువరించే నోటిఫికేషన్‌ను అనుసరించి అర్హత ఉన్నవారు ‘ఫార్మ్ 12డి’ ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో వీఎఫ్​హెచ్ విధానాన్ని పలు ఉప ఎన్నికలతో పాటు గుజరాత్ ఎన్నికల్లోనూ ఈసీ అమలు చేసిందని తెలిపారు.

ఈ విషయంపై కర్ణాటక ఈసీ ఏమన్నారంటే..?
80 ఏళ్లు పైబడిన వారు పోలింగ్ స్టేషన్​కు వచ్చి ఓటు వేయాలని ప్రోత్సహిస్తాం. పోలింగ్ కేంద్రానికి రాలేని వారి మాత్రం ఈ వెసులుబాటు ఉపయోగించుకోవచ్చు. పూర్తి ప్రక్రియను వీడియో తీస్తాం. దివ్యాంగుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందించాం. సక్షమ్ అనే యాప్​లో తమ వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వొచ్చు. అందులో ఉన్న ఆప్షన్స్ ఎంచుకొని ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఓటింగ్ అంతా రహస్యంగానే జరుగుతుంది : కర్ణాటక ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్

Latest Articles

‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్

అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్