కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ( Rahul Gandhi) తన సొంత పార్టీలో కొందరు నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీఎంసీ ఓడిపోతే కొందరు సంతోషపడుతున్నారని ఆయన విమర్శించారు. అలాంటి వారు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఇది కేవలం రాజకీయ విషయం కాదని, దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశమని ఆయన అన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని, బెంగాల్ , అసోంలో ఓట్లను లూటీ చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.


