స్వతంత్ర వెబ్ డెస్క్: ముంబైలో ఎలివేటర్ కూలిపోవడంతో 14 మంది గాయపడ్డారు. వారిలో 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. 16 అంతస్థుల నిర్మాణ భవనంలో నాలుగో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బృహముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని కమలా మిల్స్ కాంపౌండ్లోని ట్రేడ్ వరల్డ్ టవర్ సీలో ఈ ఘటన జరిగింది. మొత్తం 14 మందితో నాలుగో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తున్న ఎలివేటర్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఎలివేటర్లోని 14 మందిలో నలుగురికి స్వల్పగాయాలు కాగా.. 9 మంది ఆసుపత్రి పాలయ్యారు. 8 మంది గ్లోబల్ ఆసుపత్రిలో చేరగా.. ఒకరు కేఈఎమ్ హాస్పిటల్లో చేరారు. అయితే స్వల్ప గాయాలైన నలుగురు ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించారు. ప్రమాదంలో గాయపడినవారంతా నిలకడగా ఉన్నారని, కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.
14 మందితో ఒక్కసారిగా కూలిన ఎలివేటర్
0
463
Previous article
Next article
Latest Articles
సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్లోని సెక్రటేరియట్ వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మపల్లికి చెందిన దంపతులు కృష్ణయ్య, సాయమ్మలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తమ భూమి విషయంలో అధికారులు పట్టించుకోవడం...
- Advertisement -
- Advertisement -


