14 మందితో ఒక్కసారిగా కూలిన ఎలివేటర్

స్వతంత్ర వెబ్ డెస్క్: ముంబైలో ఎలివేటర్ కూలిపోవడంతో 14 మంది గాయపడ్డారు. వారిలో 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. 16 అంతస్థుల నిర్మాణ భవనంలో నాలుగో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బృహముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని కమలా మిల్స్ కాంపౌండ్‌లోని ట్రేడ్ వరల్డ్ టవర్ సీలో ఈ ఘటన జరిగింది. మొత్తం 14 మందితో నాలుగో ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి వస్తున్న ఎలివేటర్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఎలివేటర్‌లోని 14 మందిలో నలుగురికి స్వల్పగాయాలు కాగా.. 9 మంది ఆసుపత్రి పాలయ్యారు. 8 మంది గ్లోబల్ ఆసుపత్రిలో చేరగా.. ఒకరు కేఈఎమ్ హాస్పిటల్‌లో చేరారు. అయితే స్వల్ప గాయాలైన నలుగురు ఆసుపత్రికి వెళ్లేందుకు నిరాకరించారు. ప్రమాదంలో గాయపడినవారంతా నిలకడగా ఉన్నారని, కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్