స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎనిమిది రాష్ట్రాలు దాటి ముందుకు వచ్చామని అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.12 లక్షలు చేరడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. దేశంతో పోల్చితే 20 శాతం అదనంగా మన మూలధన వ్యయం ఉందన్నారు. దేశంలో అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పారు. అప్పులు తీసుకోవడంలో తెలంగాణ కింది నుంచి 5వ స్థానంలో ఉందని తెలిపారు.