25 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

ఏపీలో మంత్రివర్గ శాఖలపై కొనసాగుతున్న ఉత్కంఠ

  ఏపీలో మంత్రివర్గ శాఖలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరకి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కూటమి భాగస్వామ్య పార్టీలకు ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మంత్రులుగా సీనియర్లను పక్కనబెట్టిన సీఎం చంద్రబాబు మంత్రి వర్గ కూర్పుపై కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇవాళ మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది.జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్‌కు పంచాయితీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కీలక శాఖలైన ఆర్థిక, రెవెన్యూ వంటి శాఖలను ఎవరికి ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్‌ఎండీ ఫరూక్‌కు మైనార్టీ శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక గుమ్మడి సంధ్యా రాణికి గిరిజన సంక్షేమ శాఖలు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్