25.2 C
Hyderabad
Wednesday, January 22, 2025
spot_img

వేదపాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోటప్పకొండలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర వేద విజ్ఞాన్ పీఠం వేదపాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని కుందుర్తి సాయి శివ సూరజ్ (18) అనే విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్ది సూరజ్‌ది ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబాల పట్నం గ్రామం. 4 సంవత్సరాల క్రితం వేదపాఠశాలలో చేరాడు. మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థి ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థి సూరజ్ మృతి చాలా బాధాకరమని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. వేద పాఠశాల విద్యార్థి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ప్రభుత్వ పరంగా సూరజ్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు.

Latest Articles

కృత్రిమ మేథను ప్రశంసిచాలా..? అభిశంసించాలా..?

ఏమిటో ఈ మాయ అనుకున్నా, ఇదేం వింత అనుకున్నా....ఇందు, అందు, ఎందెందు చూసినా హాయ్ అంటూ ఏఐ పలకరించే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఏదైనా ఒరిజనల్ ఉండాలి కాని ఆర్టిఫిషియల్ ఏమిటి..అని పెదవి విరిచేవారు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్