స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వారాంతం రోజున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 297.94 పాయింట్లు లాభపడి 61,729.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 73.45 పాయింట్ల లాభంతో 18,203.40 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకపు విలువ 82.67గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో విప్రో, టీసీఎస్, ఐటీసీ, హెచ్సీఎల్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం షేర్లు లాభాల బాటలో పయనించగా.. టైటాన్, టాటాస్టీల్, సన్ఫార్మా, ఏషియన్ పేయింట్స్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.