17.7 C
Hyderabad
Saturday, January 17, 2026
spot_img

కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగిన షర్మిల

కూటమి సర్కార్ పై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వందల కోట్లు ఇచ్చి.. అభివృద్ధి చేసింది కేవలం దివంగత వైఎస్ఆర్ మాత్రమేనని.. ఆ తర్వాత వచ్చిన సీఎంలు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. గత పదేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదాపై .. బీజేపీ మాట మార్చిందని.. ప్రధానిగా మోదీ.. ఏపీకి ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోగలిగారా? అని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా, కడప స్టీల్ ఫ్యాక్టరీ, విభజన అంశాలపై మోదీ హామీలను నిలబెట్టుకుంటారని నమ్మకం పోయిందన్నారు. ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో టీడీపీ నేతలు ఒకసారి పరిశీలన చేసుకోవాలని షర్మిల తెలిపారు. మోదీ అంటేనే మోసమని.. పదేళ్లుగా ప్రధాని ఏపీకి వెన్నుపోటు తప్ప.. అభివృద్ధికి సహకరించింది లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. జగన్ హయాంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్టించుకోలేదని.. ఇప్పుడైనా చంద్రబాబు తన అధికారాన్ని ఉపయోగించి స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని వైఎస్ షర్మిల తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్