స్వతంత్ర, వెబ్ డెస్క్: కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17న ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తామని స్పష్టంచేశారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదిన కానుకగా కాంగ్రెస్ గెలుపును అందిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలంతా క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ విజయం కోసం అందరం సమిష్టిగా కష్టపడి గద్దె నుంచి కేసీఆర్ను దించుదామని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని మాత్రమే అని రేవంత్ ఎద్దేవా చేశారు. దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ పని అని విమర్శించారు. బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో తేదీ ప్రకటించిన రేవంత్ రెడ్డి
0
287
Previous article
Next article
Latest Articles
నిరుద్యోగులకు గుడ్న్యూస్ … రేపు మూడు నోటిఫికేషన్లు…నియామక పక్రియ అంతా ఆన్లైన్ మోడ్లోనే
చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలంగాణలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. రేపు మూడు నోటిఫికేషన్లను ఇచ్చేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది. వచ్చే వారం రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది....
- Advertisement -
- Advertisement -


