తమిళనాడులో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై సూపర్స్టార్ రజనీకాంత్ తొలిసారి స్పందించారు. తాను రాజకీయాల్లో లేనని స్పష్టం చేశారు. విజయ్ ముఖ్యమంత్రి కావడంపై అసూయ పడాల్సిన అవసరం తనకు లేదన్నారు.
“విజయ్ సీఎం కావడంపై నేను ఎందుకు అసూయపడతాను? కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయితే అసూయ పడేవాడినేమో” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే విజయ్ తన సమకాలికుడు కాదని, తమ ఇద్దరి మధ్య దాదాపు 25 ఏళ్ల వయస్సు తేడా ఉందని తెలిపారు.
తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారని, అందుకే విజయ్ను గెలిపించారని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం ఎంకే స్టాలిన్ను కలవడంపై వస్తున్న ప్రచారాలను కూడా ఆయన ఖండించారు.
“స్టాలిన్ నాకు చాలా కాలంగా మంచి స్నేహితుడు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. నేను కేవలం స్నేహపూర్వకంగా కలిసాను. దాన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు” అని రజనీకాంత్ అన్నారు.
ఇక విజయ్ను సీఎం కాకుండా అడ్డుకునేందుకు తాను ప్రయత్నించానంటూ వస్తున్న ఆరోపణలను రజనీకాంత్ తీవ్రంగా ఖండించారు. “అలాంటి నీచ రాజకీయాలు నేను చేయను. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు” అంటూ స్పష్టం చేశారు రజనీకాంత్.


