38.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కానున్న ఏపీ సీనియర్ నేత

ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయనున్నారు. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కోల్పోవడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన స్వగ్రామం నీలకంఠాపురంలో పొలం పనులు చేసుకుంటూ కుటుంబంతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఆయన మళ్లీ రాజకీయాల్లోయాక్టివ్ కాబోతున్నారని సమాచారం.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు సిటీ ఎన్నికల ఇంచార్జిగా ఆయనను కాంగ్రెస్ హైకమాండ్ నియమించినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు రఘువీరా చేత ప్రచారం చేయించాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంపై ఆయన స్థానిక కాంగ్రెస్ నేతల వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్లు వెల్లడించారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్