కాసేపట్లో 18 వ పార్లమెంట్ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకా రం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం ఉండనున్నాయి. ప్రత్యేక సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ ఉండదు. సమావేశాల తొలిరోజే దాదాపు 280 మంది లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయను న్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయను న్నారు. ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రధాని తర్వాత సీనియారిటీ ఆధారంగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఆపై మనోహర్ లాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
క్యాబినెట్ మంత్రుల తర్వాత, స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత, ఎంపీల ప్రమాణ స్వీకారం రాష్ట్రాల వారీగా మొదట అండమాన్ నికో బార్, తర్వాత ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగిలిన 264 మంది లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారం రెండో రోజు జరగనుంది. ఒక్కో ఎంపీ ప్రమాణ స్వీకారానికి దాదాపు ఒక నిమిషం సమయం పడుతుంది. తెలంగాణకు చెందిన ఎంపీల ప్రమాణ స్వీకారం రెండో రోజు జరగనుంది. 26న స్పీకర్ ఎన్నిక జరగ నుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగా నికి లోక్సభలో జులై2న, రాజ్యసభలో జులై 3న ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. 3వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి