అస్సోంని పగ బట్టిన ప్రకృతి ….లక్షల మంది నిరాశ్రయులు

అసోంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. 24 జిల్లాల పరిధిలోని 515 వరద సహాయక శిబిరాల్లో దాదాపు 4 లక్షల మంది తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం 2 వేల 800 గ్రామాలు వరదగుప్పిట్లో చిక్కుకుకున్నాయి. 42 వేల 478 హెక్టార్లలో వివిధరకాల పంటలు నీట మునిగాయి. వరదల కారణంగా పలు జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.

భారీ ఎత్తున పోటెత్తుతున్న వరదలతో నిన్న రోజే 8 మంది మృతి చెందారు. 27 జిల్లాల పరిధిలోని 16.25 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. సోనిత్‌పుర్‌ జిల్లా తేజ్‌పుర్‌లో ఇద్దరు, మోరిగావ్‌, దిబ్రుగఢ్‌, దరాంగ్‌, గోలాఘాట్‌, బిస్వనాథ్‌, తిన్‌సుకియా ప్రాంతాల్లో ఒక్కొక్కరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అసోంలో సంభవించిన ప్రకృతి విపత్తుల్లో చనిపోయినవారి సంఖ్య 56కు చేరినట్లు అధికారులు తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పర్యటించి ఖానా నదిపై నిర్మించిన ధారాపుర్ జంగ్రాబార్‌ డ్యామ్‌లో దెబ్బతిన్న స్లూయూస్‌ గేట్‌ను పరిశీలించారు. చైనా, భూటాన్‌ నుంచి కూడా వరద వస్తోందన్న హిమంత.. కామ్రూప్‌ జిల్లాలో వరద పరిస్థితిపై సమీక్షించి ఎన్డీఆర్‌ఆఫ్ బృందా లు 24 గంటలు సహాయ చర్యలు చేపడుతున్నాయనని వెల్లడించారు.

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్