Nara Devansh Birthday |టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ప్రకటించారు. ఒకరోజు అన్నప్రసాద వితరణ కోసం రూ.33లక్షలను టీటీడీ అధికారులకు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయ పరిసరాల్లోని ప్రకటన బోర్డులు ప్రదర్శించారు. కాగా దేవాన్ష్ ప్రతి పుట్టిన రోజు సందర్భంగా అన్నప్రసాద వితరణకు విరాళం ఇవ్వడం లోకేశ్ కుటుంబానికి అనవాయితీగా వస్తోంది.
Read Also: ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్ పాల్ తప్పించుకోవడంపై హైకోర్టు సీరియస్
Follow us on: Youtube Instagram