24.7 C
Hyderabad
Monday, October 2, 2023

ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్ పాల్ తప్పించుకోవడంపై హైకోర్టు సీరియస్

ఖలిస్థానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్(Amritpal Singh) తప్పించుకుపోయిన వ్యవహారంలో పోలీసుల తీరుపై పంజాబ్, హర్యానా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్‌పాల్‌ సింగ్‌ తప్పించుకోవడం రాష్ట్ర పోలీసుల నిఘా వైఫల్యమేనని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. 80 వేల మంది పోలీసులు ఉన్నారని.. అయినా అమృత్ పాల్ సింగ్(Amritpal Singh) ఎలా తప్పించుకున్నాడని పంజాబ్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. మరోవైపు ఇప్పటిదాకా 120 మందిని అరెస్టు చేశామని పోలీసులు కోర్టుకు తెలియజేశారు.

అటు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ స్పష్టంచేశారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు.

Read Also: ఫుట్ ఓవర్ కింద ఇరుక్కుపోయిన పెట్రోల్ ట్యాంకర్.. భయాందోళనలో స్థానికులు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

సంక్రాంతి బరిలో లైకా ప్రొడక్షన్స్ ‘లాల్ సలాం’

అగ్ర హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్