తెలంగాణలో గంజాయి గుప్పుమంటోంది. గంజాయి స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. సైబరాబాద్ SOT పోలీసులు గంజాయిని విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్న కిలాడి లేడీ ఇంటిపై దాడులు చేశారు. పక్కా సమాచారంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నానక్ రామ్ గూడలో గల నీతూబాయ్ అనే మహిళా ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆమె ఇంట్లో 20 కేజీల గంజాయితో పాటు 20 లక్షల నగదు గుర్తించారు. నీతూబాయ్ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో రెండు సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ నీతు భాయ్ పట్టిబడినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, జీడిమెట్ల 1500, పటాన్చెరులో 1960 గంజాయి చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిజాంపేటలో 114 ప్యాకెట్స్ ఈ సిగరేట్లను సీజ్ చేసిన పోలీసులు… ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు