28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

పాంగాంగ్‌ సరస్సుపై మారథాన్..!

  • ఈనెల 20న లడాఖ్‌లోని మారథాన్‌లో పాల్గొననున్న 75 మంది అథ్లెట్లు
  • భారత్‌లో తొలిసారి ఘనీభవించిన సరస్సుపై అథ్లెట్ల పరుగులు

నగరాలు, పట్టణాల్లో ప్రతి వీకెండ్ మారథాన్‌లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. అయితే.. జమ్మూ, కాశ్మీర్ లో ఈనెల 20న ఒక వినూత్న మారధాన్ జరగబోతోంది. ఇక్కడ మారథాన్ అంటే రోడ్లపై పరుగులు తీయడం కాదు. ఘనీభవించి సరస్సుపై పరుగులు తీయాల్సి ఉంటుంది. లడాఖ్‌ లోని పాంగాంగ్ సరోవరంలో ఈ మారథాన్ నిర్వహిస్తారు. భారత్‌లో ఈ తరహా మారథాన్ నిర్వహించడం ఇదే తొలిసారి. 13,862 అడుగుల ఎత్తున్న ఈ సరస్సు దాదాపు 700 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ మైనస్ 30 డిగ్రీల సెల్షియస్ టెంపరేచర్ ఉంది.

లడాఖ్‌ మారథాన్‌లో 75 మంది స్వదేశీ, విదేశీ అథ్లెట్లు పాల్గొంటారు. వాతావరణ మార్పులను ప్రపంచం దృష్టికి తీసుకురావడమే లడాఖ్‌ మారథాన్ లక్ష్యం అంటున్నారు నిర్వాహకులు. ఈ మారథాన్‌కు.. లాస్ట్ రన్ అని పేరుపెట్టారు. లాస్ట్ రన్ మారధాన్‌తో లడాఖ్ ప్రాంతంలో టూరిజం పెరిగే అవకాశాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్