మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి పొంగులేటి టార్గెట్గా మరో అస్త్రాన్ని సంధించారు. గత కొద్దిరోజులుగా పొంగులేటి నివాసంలో జరిగిన దాడులను ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉందని ఆరోపించారు. ఈడీ దాడులు జరిగి నెల రోజులు కావస్తున్నా కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉన్నందునే ఈడీ దాడులపై బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట కూడా లేదని మండిపడ్డారు. ఈడీ దాడుల్లో భారీగా డబ్బు దొరికినట్లుగా మీడియాలో వార్తలు వచ్చినా కేసు నమోదు కాలేదని తెలిపారు. ఈడీ దాడులు ముగిసిన తర్వాత హైదరాబాద్లో ఆదానీతో మంత్రి పొంగులేటి రహస్యంగా భేటీ అయ్యారనని.. ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్విడ్ ప్రోకో కాక మరేమిటి ప్రశ్నించారు కేటీఆర్.