ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దుబాయ్లో ప్రొడ్యూసర్ కేదార్ చనిపోతే కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో కేదార్ నిందితుడిగా ఉన్నాడన్నారు. కొన్ని మిస్టీరియస్ డెత్స్ జరుగుతున్నాయని.. కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడమేంటని అనుమానం వ్యక్తం చేశారు. ముందు సంజీవరెడ్డి, రాజలింగం.. ఇప్పుడు కేదార్ చనిపోయారన్నారు. కేదార్ మరణంపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని నిలదీశారు.