బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల13వ తేదీ నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టను న్నారు. ఇందులో భాగంగా ఆ రోజున చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహంతో పోలిస్తే ఈసారి భిన్నంగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. బస్సు యాత్రలు, బహిరంగ సభలపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్చేసేలా బస్సుయాత్ర చేస్తూనే అక్కడకక్కడా బహిరంగ సభల్లోనూ కేసీఆర్ ప్రసంగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.వరంగల్ లోక్సభతోపాటు సికింద్రా బాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు పూర్తిచేసినట్టు తెలిసింది. క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించిన గులాబీ దళపతి ఒకట్రెండు రోజుల్లో ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం.
చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న కేసీఆర్
0
498
Previous article
Next article
Latest Articles
బండి భగీరథ్కు మూడు రోజుల పోలీస్ కస్టడీ
పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -
- Advertisement -


