జనసేన అభ్యర్థుల లిస్టుపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కసరత్తు చేస్తున్నారు. తొలి లిస్టులో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించు కున్నారు. ఈ మేరకు పలువురు అభ్యర్థులను పరిశీలించి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.అయితే ఐదుగురు అభ్యర్థులకు పవన్ కాల్యాణ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. విశాఖ, ఉభయగోదావరి జిల్లాలో నేతలతో బుధవారం సాయంత్రం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. భీమవరం-రామంజనేయులు, రాజోలు- రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్, నరసా పురం-బొమ్మడి నాయకర్,ఉంగుటూరు- ధర్మరాజు, తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్ పేరును పవన్ ఖరారు చేశారు. ఇప్పటికే ఒక్కో అభ్యర్థితో పవన్ కల్యాణ్ స్వయంగా మాట్లాడారు. ఇవాళ జనసేన అభ్యర్థుల పూ ర్తి జాబితాను విడుదల చేయనున్నారు.