28.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

జైల్లో నందిగం సురేష్‌ను పరామర్శించనున్న జగన్‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ బెంగళూరు నుండి తాడేపల్లికి రానున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను రేపు ఆయన పరామర్శించనున్నారు.

వైఎస్‌ జగన్‌ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు యలహంక నివాసం నుండి రోడ్డు మార్గంలో బయలుదేరతారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 3గంటల 25నిమిషాలకు చేరుకుంటారు. 4 గంటలకు విమానంలో బయలుదేరి 5గంటల 40నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 6గంటల 25నిమిషాలకు తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు. రేపు గుంటూరు వెళ్లి జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శిస్తారు. నందిగం సురేశ్‌ను ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్‌ విధించింది.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్