స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలో ముఖ్యమంత్రి అసమర్థ పాలనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు , విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి తదితరులు మీడియా సమావేం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంటా మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభూత్వం, తమ అధినేత చంద్రబాబు పాలనలో చేపట్టిన భోగాపురం ఎయిర్ పోర్ట్, అదానీ డేటా సెంటర్ లకు సిఎం జగన్ శంఖుస్థాపనలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు విశాఖలో ఎయిర్ పోర్ట్ వుండగా భోగాపురంలో రెండో విమానాశ్రయం అనవసరమన్నారని, తాము అధికారం లోకి వచ్చిన తరువాత భోగాపురం భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని ప్రజలను ఏమార్చారన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్ళ అనంతరం మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని శంఖుస్థాపనల పర్వానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా కక్ష సాధింపు రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రజలకు మేలు చేయాలని గంటా వ్యాఖ్యానించారు.
‘వాటికి సీఎం జగన్ శంఖుస్థాపన చేయటం హాస్యాస్పదంగా ఉంది’
0
433
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


