గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడానికి 2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం కార్యక్రమం మొట్టమొదటి సారిగా తెలంగాణలో జరగనుంది. తెలంగాణతో పాటు ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో దాదాపు 80,000 మందికి పైగా క్రీడాకారులతో కార్యక్రమం జరగనుంది.
మహబూబ్నగర్లో రేపు ఈశా గ్రామోత్సవం ప్రారంభం కానుంది. క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస గౌడ్, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, యువ హీరో కిరణ్ అబ్బవరం, సింగర్ రామ్ మిరియాల ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే!
వేదిక: DSA మెయిన్ స్టేడియం గ్రౌండ్, DYSO ఆఫీస్, మహబూబ్నగర్, తెలంగాణ,తేదీ:11 ఆగస్టు 2023 సమయం: ఉ. 11 గం.లకు
పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్, గ్రామీణ ఆటలు, సాంప్రదాయ కళలు గ్రామోత్సవంలో ముఖ్య విభాగాలు.
ఆగస్టు 19, 20 తేదీల్లో సిద్దిపేటలో, ఆగస్టు 26, 27తేదీల్లో జనగాం, కరీంనగర్, సంగారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, యదాద్రి జిల్లాల్లో కూడా ఈ పోటీలు జరగనున్నాయి.
గ్రామోత్సవం 2023 గురించి సద్గురు మాటల్లో:
https://www.instagram.com/reel/CvpO93ZsiGp/?igshid=MTc4MmM1YmI2Ng==
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం:
https://isha.co/gramotsavam-telugu


