మెదక్లో కొనసాగుతున్న బంద్
మెదక్ పట్టణ కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జంతు వధపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో నిరసన తెలుపుతూ బంద్కు పిలుపునిచ్చింది బీజేపీ. దీంతో వర్తక వ్యాపార సమూదాయాలను స్వచ్చందంగా మూసివేశారు వ్యాపారస్తులు. మరోపక్క బంద్ కారణంగా భారీగా పోలీసులు మోహరించారు. గొడవలకు పాల్పడితే ఎవరిని వదిలే ప్రసక్తి లేదని.. చర్యలు తప్పవని హెచ్చరించారు డీజీ రంగనాథ్.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యకుమార్
ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. సచివాలయంలో మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు స్వీకరిం చారు. వైద్యంలో రాష్ట్రాన్ని మోడల్గా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్య కళాశాలల ఏర్పాటులో గత వైసీపీ ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు.