చిత్తూరు జల్లా పలమనేరులో ఏనుగు హల్చల్ చేసింది. స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద రోడ్డుపై బీభత్సం సృష్టించింది. పలమనేరు వద్ద బెంగళూరు, చెన్నై జాతీయ రహదారి దాటే ప్రయత్నం చేసింది గజరాజు. ఈనేపథ్యంలోనే వాహనాల రద్దీ ఎక్కువ ఉండడంతో అక్కడే గంటపాటు తిష్టవేసింది. దీంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు ఏనుగును ఫోన్ బంధించేందుకు యువత యత్నించారు. గంటలు గడిచినా అటవీ సిబ్బంది ఘటనా స్థలికి రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.