Former MLA Neeraja Reddy | ఏపీలోని కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తుండగా బీచుపల్లి వద్ద టైర్ పేలి… వారు ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నీరజారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో నీరజారెడ్డి చికిత్స పొందుతూ చనిపోయారు. ఈమె 2009లో ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇంఛార్జ్ గా కొనసాగుతున్నారు. నీరజారెడ్డి మృతితో కుటుంబికులతోపాటు స్థానిక బీజేపీ నేతల్లో విషాదం నెలకొంది.
బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో ఆలూరు మాజీ ఎమ్మెల్యే దుర్మరణం
0
308
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


