Delhi Liquor scam case | లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణ కొనసాగుతుంది. దాదాపు ఏడు గంటలుగా కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ.. ఇంకా కొనసాగుతోంది. లిక్కర్ స్కాంలో పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలు, ఇందులో సీఎం కేజ్రీవాల్ పాత్ర ఎంతుంది, కమీషన్ రేట్లను పెంచడం లాంటి విషయంపై విచారణ కొనసాగిస్తున్నారు. రూ.100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీష్ సిసోడియాతో పాటుగా గ్రూప్ ఆప్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి కేజ్రీవాల్ ఆమోదం తెలపడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కేజ్రీవాల్పై సీబీఐ విచారణ నేపథ్యంలో ఆప్ అత్యవసర భేటీ నిర్వహించనుంది. రేపు ఢిల్లీ అసెంబ్లీ అత్యవసర సమావేశం కానుంది.
ఏడు గంటలుగా కేజ్రీవాల్ విచారణ… రేపు ఆప్ అత్యవసర భేటీ
0
287
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


