ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లా ఝిన్ఝానా ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ముస్తాఫా గ్యాంగ్ సభ్యులకు, యూపీ ఎస్టీఎఫ్ పోలీసులకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముస్తాఫా గ్యాంగ్ సభ్యులు నలుగురు మృతి చెందారు. దుండగుల కాల్పుల్లో ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఇన్స్పెక్టర్ను ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్ కౌంటర్లో మృతి చెందిన ముస్తాఫా ముఠా సభ్యులను సతీష్, అర్షద్, మన్జీత్గా గుర్తించారు పోలీసులు. వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న ముస్తాఫా ముఠా సభ్యులను పట్టుకునేందుకు యూపీ ఎస్టీఎఫ్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను చూసిన నిందితులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.