32.2 C
Hyderabad
Friday, February 7, 2025
spot_img

ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్

ఉత్తరప్రదేశ్‎లోని షామ్లీ జిల్లా ఝిన్‎ఝానా ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ముస్తాఫా గ్యాంగ్ సభ్యులకు, యూపీ ఎస్టీఎఫ్ పోలీసులకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముస్తాఫా గ్యాంగ్ సభ్యులు నలుగురు మృతి చెందారు. దుండగుల కాల్పుల్లో ఎస్టీఎఫ్ ఇన్స్‎పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఇన్స్‎పెక్టర్‎ను ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్ కౌంటర్లో మృతి చెందిన ముస్తాఫా ముఠా సభ్యులను సతీష్, అర్షద్, మన్‎జీత్‌గా గుర్తించారు పోలీసులు. వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న ముస్తాఫా ముఠా సభ్యులను పట్టుకునేందుకు యూపీ ఎస్టీఎఫ్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను చూసిన నిందితులు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

Latest Articles

సంక్షిప్త వార్తలు

హీట్‌ పుట్టిస్తున్న తీన్మార్‌ మల్లన్న వ్యవహారం కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం హీట్ పుట్టిస్తోంది. వరుస వివాదాలతో పార్టీని ఇరుకున పెడుతున్న మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్