ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. దేశ రాజధాని అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో హోరాహోరీ నడుస్తోంది. బీజేపీ 10 స్థానాల్లో , ఆప్ 7 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ లో ఆప్ అగ్రనేతలు వెనుకంజలో ఉన్నారు. న్యూ ఢిల్లీ స్థానంలో మాజీ సీఎం కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. జంగ్ పురాలో ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు మొత్తం 70 ఉండగా .. అధికారం చేపట్టాలంటే 36 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటాలి. ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60.54 శాత మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన అంచనాల ప్రకారం బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలింది.
ఢిల్లీలో మస్లిం ఓటింగ్ పరిశీలిస్తే.. 2015లో దాదాపు ఆప్ కి 77 శాతం మంది ముస్లింలు ఓటు వేశారు. 2020లో ఇది 83 శాతానికి పెరిగింది. కాంగ్రెస్ కి 13 శాతం, బీజేపీకి 3 శాతం మాత్రమే ముస్లింలు ఓటు వేశారు. 2020లో ఆప్ కి 54 శాతం ఓట్లలో దాదాపు 11 శాతం ముస్లింలు ఓటు వేశారు.