29.2 C
Hyderabad
Tuesday, September 26, 2023

భారత్‌జోడో యాత్రకు కరోనా ఎఫెక్ట్‌.! తాత్కాలికంగా నిలిపేయాలని కేంద్రం సూచన

  • రాహుల్‌గాంధీ, అశోక్‌ గెహ్లెట్‌కు లేఖ పంపిన ఆరోగ్యశాఖ
  • యాత్రలో పాల్గొంటున్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం
  • మాస్క్​లు ధరించడంతో పాటు.. శానిటైజర్లు వాడాలన్న కేంద్రం

భారత జోడో యాత్రపై కరోనా ప్రభావం పడింది. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీతో పాటు రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​ సుఖ్​ మాండవీయ తాజాగా లేఖ రాశారు. వ్యాక్సిన్​ తీసుకున్న వ్యక్తులే భారత్​ జోడో యాత్రలో పాల్గొనాలని సూచించారు. యాత్రలో పాల్గొనే వాళ్లంతా మాస్క్​లు ధరించేలా, శానిటైజర్లు వాడేలా పర్యవేక్షించాలన్నారు. కొవిడ్​ కట్టడికి సంబంధించిన నిబంధనలను అమలు చేయాలని కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. అత్యవసర ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి యాత్రను ఆపేయాలని స్పష్టం చేశారు.

జపాన్, అమెరికా, చైనా, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోందనే వార్తల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకూ కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. కొవిడ్​ ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా.. రాహుల్​ గాంధీకి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాయడంపై కాంగ్రెస్​ నేత అధిర్​ రంజన్​ చౌదరి స్పందించారు. బహుశా రాహుల్​ గాంధీ పాదయాత్ర చేయడం ఆరోగ్యశాఖ మంత్రి మన్​ సుఖ్​ మాండవీయకు నచ్చడం లేదనుకుంటా అని వ్యాఖ్యానించారు. యాత్రపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Latest Articles

‘మట్టికథ’తో ఇంప్రెస్ చేసిన అజయ్ వేద్

అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో 9 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది ‘మట్టి కథ’. ఈ సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు యంగ్ హీరో అజయ్ వేద్. అతని యాక్టింగ్ టాలెంట్, గుడ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్