- ఈ ఏడాది 22వేల కేసులు నమోదు
- 296 రేప్ కేసులు, 126 కిడ్నాప్ కేసులు నమోదు
- పెరిగిన వాహనాలో చోరీలు.. సైబర్ నేరాలు
హైదరాబాద్: 2022 సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో వార్షిక నేర నివేదిక వివరాలను వెల్లడించిన సీపీ.. ఈ ఏడాది మొత్తం 22,060 కేసులు నమోదయ్యాయన్నారు. 296 రేప్ కేసులు, 126 కిడ్నాప్ కేసులు … భారీగా ఆర్థిక నేరాలు నమోదు అయ్యాయని తెలిపారు. వాహనాల దొంగతనాల కేసులు ఏడాది బాగా పెరిగాయన్నారు. సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం… వజ్రోత్సవాలు లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్స్ చాలా ప్రశాంతంగా జరిగాయన్నారు సీవీ ఆనంద్.
