26.6 C
Hyderabad
Wednesday, July 16, 2025
spot_img

రాత్రికి రాత్రే కబ్జా స్థలంలో నిర్మాణం ….రిజిస్ట్రేషన్

     మేడ్చల్‌ జిల్లాలో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు. కోట్లాది రూపాయల విలువైన కాలనీ పార్కు స్థలంపై కన్నేసారు. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ, మామూళ్ల మత్తులో జోగుతోం ది. మేడ్చల్ మున్సిపాల్టీ పరిధిలోని సాయి శ్రీ నిలయ వెల్పేర్ సొసైటీ స్థలంపై కన్నేసిన భూ కబ్జా దారులు ఏకంగా ప్రహరీ గోడను నిర్మించేసారు. ఈ కబ్జా వెనుక అధికార పార్టీ నేత హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్కు స్థలాన్ని కాపాడాలంటూ మున్సిపల్ అధికారుల దృష్టికి కాలనీ వాసులు తీసుకె ళ్లినా ఫలితం లేకుండా పోయింది.

    ఆరేళ్ల క్రితం సాయి శ్రీ నిలయ వెల్ఫేర్ సోసైటీ పేరిట సర్వే నెంబర్ 873, 882లలో 2015లో 256 ప్లాట్లతో లే అవుట్‌ వేసారు. 1970 గజాల స్థలాన్ని పార్క్ కోసం కేటాయించారు. అయితే ఈ స్థంలోని 400 గజాల స్థలాన్ని అక్రమించుకొని ప్రీ కాస్ట్ వాల్ నిర్మాణానికి పూనుకున్నారు కబ్జాదారులు. ఇదే విషయాన్ని మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులకు కాలనీవాసులు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరును నిరసిస్తూ కాలనీవాసులు పార్కు స్థలం వద్ద ఆందోళన చేపట్టారు.

    ట్విస్ట్‌ ఏమంటే…రాత్రికి రాత్రే నిర్మాణం చేపట్టిన పార్క్ స్థలాన్ని అక్రమ పద్దతిలో ముగ్గురు పేరిట రిజిస్ట్రేషన్ చేసేశారు. మూడు డాక్యుమెంట్లు మారినట్లు సమాచారం. మంచిర్యాలకు చెందిన కౌన్సిలర్ దీన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న సీఎం రేవంత్ పార్క్ స్ధలాన్ని కాపాడాలని కోరుతున్నారు కాలనీవాసులు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్