లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. లోక్ సభ అభ్యర్ధులను ఖరారు చేసే పనిలో పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి మెజారిటీ ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ వ్యూహారచన చేస్తుంది. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. పది మంది అభ్యర్ధులు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 12 పార్లమెంట్ స్థానాలకు ఒక్క అభ్యర్ధి పేరును కాంగ్రెస్ నాయకత్వం కేంద్ర ఎన్నికల కమిటీకి పంపింది. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో ఒక్క పేరు కోసం ఏకాభిప్రాయం కుదరలేదు.
కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, జహీరాబాద్ నుంచి సురేష్ సెట్కార్, చేవెళ్ల – సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ – బొంతు రామ్మోహన్, నల్గొండ నుంచి జానారెడ్డిని బరిలో దిగే అవశం ఉంది. ఖమ్మం, నాగర్ కర్నూలు, వరంగల్ స్థానాలు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్, మెదక్, మల్కాజ్ గిరి, హైదరాబాద్ స్థానాలకు త్వరలో అభ్యర్ధుల ఫైనల్ చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం నుండి రాహుల్ గాంధీని పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. రాహుల్ గాంధీని ఖమ్మం లేదా భువనగిరి, నల్గొండ పార్ల మెంట్ స్థానాల నుండి పోటీ చేయించాలని ఆ పార్టీ నాయకత్వం ప్రతిపాది స్తుంది. అయితే ఈ విష యమై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.