29 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

చిక్ బల్లాపూర్ రోడ్డు ప్రమాదంపై స్పందించిన సీఎం జగన్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఈ రోజు ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని చిక్ బల్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు ట్యాంకర్ గుద్దుకున్న ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది అక్కడికక్కడే మరణించగా, ఒక్క వ్యక్తి మాత్రం తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో ఉన్నాడు. విషాదకరమైన విషయం ఏమిటంటే… చనిపోయిన వారు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాకు చెందినవారే కావడం చాలా బాధాకరం. తాజాగా ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన వారు మరణించడం నన్ను చాలా కలచివేసిందన్నారు. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను అంటూ బాధపడ్డారు సీఎం జగన్. మరణించిన బాధిత కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి పరిస్థితి చాలా విషమంగా ఉన్న వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేద్దామన్నారు సీఎం జగన్. ఇక మరణించిన వారి గ్రామాలల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్