22.7 C
Hyderabad
Thursday, November 30, 2023
spot_img

Chandrababu: చంద్రబాబుతో ములాఖత్‌లు పెంచాలని న్యాయవాదుల పిటిషన్

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్‌ను జైలు అధికారులు రెండు నుంచి ఒకటికి కుదించిన విషయం తెలిసిందే. ములాఖత్‌లు పెంచాలని కోరుతూ టీడీపీ అధినేత న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్నారు. లీగల్ ములాఖత్‌లు రోజుకు మూడుసార్లు ఇవ్వాలని న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వివిధ పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడటానికి తమకు అవకాశం ఇవ్వాలన్నారు. న్యాయపరమైన అంశాల మీద చర్చించేందుకు చంద్రబాబుతో కలిసేందుకు జైలు అధికారులు అంగీకరించడం లేదని తెలిపారు. ములాఖత్ ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు లాయర్ల లీగల్ ములాఖత్‌పై పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి తెలిపారు

Latest Articles

హైదరాబాద్‌లో పోలింగ్‌కు సర్వం సిద్ధం

హైదరాబాద్ నగరంలో ఓటింగ్ ఏర్పాట్లను సిద్దం చేశారు అధికారులు.  రేపు సాయంత్రానికి ఎన్నికల క్యాంపెయిన్  ముగుస్తుండటంతో అందరూ అధికారులు పోలింగ్ పై ఫోకస్ చేయనున్నారు.  డిసెంబర్ ఒకటిన ఉదయం  సరిగ్గా ఏడు గంటలకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్