మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మరోసారి స్పష్టంచేశారు. అమరావతి(Amaravathi) ఉద్యమంలో నిజమైన రైతులెవరూ లేరని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఉన్నారని ఆరోపించారు. రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా? అని ప్రశ్నించారు. విశాఖ నుంచి పాలన చేయాలనేది తన అభిప్రాయమని వ్యాఖ్యానించారు. ఐదేళ్లు పాలించామని తమకు ప్రజలు అవకాశమిచ్చారని.. అలాంటప్పుడు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లామని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో మూడు రాజధానుల నినాదంతోనే ప్రజల్లోకి వెళ్తామని బొత్స వెల్లడించారు. ఇక ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి తాను బాధ్యత తీసుకుంటానన్నారు.